Showing posts with label ఎలా?/YELA?/HOW?. Show all posts
Showing posts with label ఎలా?/YELA?/HOW?. Show all posts
Saturday, 29 December 2018
కెమెరా ఫ్లాష్ లైట్ ఎలా పని చేస్తుంది?
వెలుతురు సరిగా లేనప్పుడు చీకటిలో ఫోటోలు తీయవలసి వచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్లు కెమెరాలో ఫ్లాష్ లైట్ ను ఉపయోగిస్తారు.ఆధునికంగా తయారైన ఫ్లాష్ గన్ లోని క్జెనాన్ ఫ్లాష్ లాంప్ ద్వారా కనంతి వెలువడుతుంది.ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్ లు ,విద్యుత్ శక్తి సాయంతో పని చేస్తుంది.డ్రై బ్యాటరీ ద్వారా దీనికి విద్యుత్ లభిస్తుంది.ఆల్టర్నేట్ కరెంట్ ను కూడా లైటు వెలిగించడానికి ఉపయోగించవచ్చు.ఫ్లాష్ లైటు విద్యుత్ ను కాంతి శక్తిగా మారుస్తుంది.ఫ్లాష్ లాంప్ ఒక గాజు నాళిక.సాధారణంగా ఇది 2 అంగుళాల పొడవు ,పావు అంగుళం వ్యాసం కలిగి ఉంటుంది.నాళికలో 2 కొసలలోనూ 2 టంగ్ స్టన్ ఎలక్ట్రోడులను అమరుస్తారు.నాళికలో గాలిని తీసేసి 400-500 మిల్లి మీటర్ల ఒత్తిడి గల క్జెనాన్ వాయువును నింపుతారు.నాళిక చుట్టూ సన్నని తీగను చుడతారు.ఇది 3 వ ఎలక్ట్రోడుగా పని చేస్తుంది.దీనినే ట్రిగ్గర్ ఎలక్ట్రోడ్ అని కూడా అంటారు.
లాంప్ లోని 2 ఎలక్ట్రోడులను ఎలక్ట్రిక్ సర్క్యూట్ కు కలుపుతారు.షట్టర్ న్య్ నొక్కగానే ఎలక్ట్రిక్ మీట ఆన్ అవుతుంది.ఈ సమయంలో కెపాసిటర్లో నిల్వ ఉన్న విద్యుత్ క్జెనాన్ లాంప్ ద్వారా వెలువడుతుంది.ఫలితంగా కాంతి వెలువడి ఫోటో తీయవలసిన వస్తువు లేదా మనిషి మీద పడుతుంది.
Thursday, 13 December 2018
దీపం వత్తి ద్వారా చమురు / నూనె ఏ విధంగా పైకి వస్తుంది?
వత్తిలోని తంతువుల మధ్య గాలి దూరే స్థలం ఉండటం వల్ల వత్తిలో చాలా సన్నని రంధ్రాలు గల అసంఖ్యాకమైన కేశికలు ఉంటాయని పరిగణించడమైనది.ఈ వత్తికి చెందిన ఒక భాగాన్ని చమురులో ముంచినప్పుడు కేశిక చర్య కారణంగా చమురు వత్తి పై భాగానికి ప్రసారమౌతుంది.
Tuesday, 11 December 2018
విమానానికి ప్రమాదం జరిగినప్పుడు ఒక వ్యక్తి జాగ్రత్తగా కిందికి దిగడంలో ప్యారాచూట్ ఎలా సహకరిస్తుంది?
ప్యారాచూట్ కోటరంలో తగినంత గాలి ఉంటుంది.కిందికి దిగేటప్పుడు ప్యారాచూట్ అకస్మాత్తుగా కిందికి పడిపోకుండా ఉండటానికి ఈ కోటరంలోని గాలి దాన్ని పైకి లేపుతూ ఉంటుంది.అందువల్ల ప్యారాచూట్ నెమ్మదిగా కిందికి దిగుతుంది.
Saturday, 7 July 2018
మేఘాలు యే విధంగా యేర్పడతాయి?
సూర్య రశ్మి వలన , గాలి వలన, సముద్రాలు, చెరువులు ,సరస్సులు,కుంటలు,నదులు తదితర నీతివనరుల నుండి నీరు ఆవిరై వాతావరణం లోని యెత్తైన ప్రదేశాల్లోకి చేరుకొంటుంది.అక్కడ ఈ నీటి ఆవిరి చిన్న చిన్న నీటి బిందువులుగా ద్రవీభవించి మేఘాలు యేర్పడతాయి.మేఘాల్లోని ఈ నీటి బిందువులు సంలీనత చెందినపుడు వర్షం పడుతుంది.
Thursday, 29 June 2017
భూగర్భ రైలు మార్గం ఎలా నిర్మిస్తారు? / BHUGARBHA RAILUMARGAM YELA NIRMISTARU? / UNDERGROUND RAILWAYS
ఇప్పుడు అన్ని దేశాలలోనూ రైలు మార్గాలు ఉన్నాయి.రేయీ పగలూ మనుషులను సరకులనూ రవాణా చేస్తున్నాయి.అనేక దేశాలలో భూగర్భ రైలు మార్గాలు కూడా ఉన్నాయి.ఐతే ప్రపంచంలోకెల్లా పురాతన రైలు మార్గం మాత్రం లండన్ నగరంలో ఉంది.రైలు మార్గం ఎక్కది నుండి ఎక్కడికి వేయాలో నిర్ణయించిన తర్వాత వీధులలోఅ లోతుగా కందకం తవ్వుతారు.తర్వాత రైలు పట్టాలను పరుస్తారు.గోతిని మూసివేస్తారు.ఈ పద్ధతిని కట్ అండ్ కవర్ అంటారు.
లండనులో నిర్మించిన రైలు మార్గం సుమారు 4 మైళ్ళ పొడవు ఉంది.దీనిని లండన్ నగరంలో పేడింగ్ టన్ స్టేషన్ నుండి ఫారింగ్ టన్ స్టేషన్ వరకు నిర్మించారు.10 జనవరి 1863 నుండి రైళ్ళు తిరగడం ప్రారంభించాయి.మొదట వీటి పై ఆవిరి రైలింజన్ లు నడిచాయి.ఇంజను నుండి వచ్చే పొగ వల్ల ప్రయాణీకులకు చాలా ఇబ్బందిగా ఉండేది.కానీ ప్రపంచంలో తొలి భూగర్భ రైలు మార్గం కావడం తో ప్రయాణీకులు తండోపతండాలుగా వచ్చే వారు.ఈ రైళ్ళలో ప్రతి రోజూ సుమారు 30,000 మంది ప్రయాణించేవారు.
ఆ తర్వాత కొంత కాలానికి మరికొన్ని రైలు మార్గాలను నిర్మించారు.1890 లో లోతైన సొరంగ మార్గం గుండా విద్యుచ్చక్తి రైళ్ళను నడపటానికి వీలుగా రైలు మార్గాలను లండనులో నిర్మించారు.మొదట్లో రైళ్ళకు కిటికీలు ఉండేవి కావు.ఎందుకంటే రైలు సొరంగంలో వెడుతుంది కాబట్టి చూసేందుకు ఏమీ ఉండదు.రైల్వే లైనులో లోతైన భూగర్భ స్థలం హేంస్ స్టెడ్ దగ్గర ఉంది.ఇక్కడ లోతు 67.3 మీటర్లు.స్టేషన్ రాగానే రైలు గార్డు స్టేషన్ పేరును గట్టిగా అరిచేవాడు.1979 నాటికి ఈ మార్గంలో 500 రైళ్ళు ప్రయాణీకులను తీసుకెళ్ళాయి.వీటిలో కెల్ల దూరమైన మార్గం ఎప్టింగ్ నుండి రుస్లిప్ కు ఉంది ( 54.8 కి.మీ )
ఇతర దేశాలలో కూడా భూగర్భ రైలు మార్గాలు ప్రజాదరణ పొందాయి.1900 లో పారిస్ లో ప్రారంభించారు.అమెరికాలో మొదటి సబ్ వే లైనును బోస్టన్ లో 1895 -1897 ల మధ్య నిర్మించారు.1904 లో న్యూయార్క్ లో మొదటి భూగర్భ రైల్వే మొదలయింది.ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా పెద్దది.1930 లో మాస్కోలో నిర్మించారు.
జపానులో టోక్యో నగరంలో 1927 లోనే మొదలయింది.కెనడాలో 1954 లో టొరంటో సబ్ వే ప్రారంభించారు.ఇంకా మరికొన్ని దేశాలలో ఈ మార్గాలున్నాయి.మన దేశంలో కలకత్తాలో మొదటి భూగర్భ రైల్వే మార్గం 1986 లో ప్రారంభించారు.
Wednesday, 7 June 2017
జనరేటర్ ఎలా పని చేస్తుంది? / GENERATOR YELA PANI CHESTHUNDI?
ఏదైనా ఒక యానకం నుండి ఎలక్ట్రానులు ఒక నిర్దిష్ట దిశలో,నిర్దిష్ట వేగంతో ప్రయాణించడాన్నే మనం విద్యుత్తు అని అంటున్నాము.ఇలా ప్రవహించడం ద్వారా పుట్టే శక్తిని ఉష్ణ శకి గానూ,కాంతి శక్తిగానూ,చలన శక్తి, అంకా యాంత్రిక శక్తి వంటి రకరకాల శక్తి రూపాలలోకి మార్చి మన అవసరాలకు వాడుకుంటున్నాము.ఉదాహరణకు కరంటు బల్బు ద్వారా విద్యుత్ ను కాంతి రూపంలోకి మార్చుకుంటే ,కరంట్ స్తవ్ ద్వారా దానిని ఉష్ణ శక్తి గా మార్చుకుని వాడుకుంటున్నాము.విద్యుత్ కు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దానికి,అయస్కాంత తత్వానికి ఒక విడదీయలేని సంబంధం ఉంది.ఎలాగ అంటే ఒక తీగ గుండా ఒక నిర్దిష్ట దిశలో ఎలక్ట్రానులు ప్రవహించేలా చేసినప్పుడు ఆ తీగ చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.అదే విధంగా ఏదన్నా ఒక తీగ మీదుగా ఒకే దిసలో అయస్కాంతాన్ని కదిలించినప్పుడు,అయస్కాంతానికి సంబంధించిన అయస్కాంత శక్తి తీగలోని ఎలక్ట్రానులను ఆ దిశలో ముందుకు చలించేలా చేస్తుంది.జనరేటర్ కూడా సరిగ్గా ఈ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని పని చేస్తుంది.జనరేతర్ లో ఉండే అయస్కాంతం ఒక వైరుకు దగ్గరగా కదలడం ద్వారా ఆ వైరులోని ఎలక్ట్రానులు నిలకడగా ప్రవహించేలా చేస్తుంది.ఒక విధంగా చూస్తే అచ్చం ఒక నీటి పంపు పనిచేసేటట్లుగానే జనరేటర్ కూదా పని చేస్తుందని చెప్పవచ్చు.నీటి పంపు ఒక నిర్దిష్ట మొత్తంలోని నీటి అణువులను కదిలించడమే కాకుండా ,వాటిపై ఒక నిర్దిష్ట మొత్తంలో ఒత్తిడిని కూడా కలిగిస్తుంది.సరిగ్గా ఇదే విధంగా జనరేటర్ కూడా నిర్దిష్ట మొత్తంలో ఎలక్ట్రానులను లాగడమే కాకుండా వాటిపై నిర్దిష్ట పరిమాణంలో ఒత్తిడిని కూడా కలిగిస్తుంది.దానితో ఆ ఎలక్ట్రానులు విధిగా ముందుకు ప్రయాణించి విద్యుత్తును సృష్టిస్తాయి.జనరేటర్ పనిచేసినంత సేపు ఈ చర్య నిరంతరంగా కొనసాగుతూ మనకు కావలసినంత విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది.
Tuesday, 6 June 2017
అంతరిక్షంలో కూడా విద్యుత్ ను పుట్టించవచ్చా? / ANTHARIKSHAM LO KOODA VIDYUTH NU PUTTINCHAVACHA?
భూవాతావరణాన్ని దాటాక సౌరశక్తి చాలా తీవ్రంగా ఉంటుంది.నేలను తాకే సూర్య రశ్మికన్నా భూవాతావరణాన్ని దాటాక లభించే సూర్యరశ్మి సుమారు 5 రెట్లు శక్తివంతంగా ఉందని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు.దాంతో అంతరిక్షంలోనే సౌరవిద్యుత్తును తయారు చేసి దానిని ఏదో ఒక రూపంలో భూమికి తీసుకురాగలిగినట్లైతే విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చవచ్చని అదే సమయంలో వాతావరణ కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.ఈ విషయంలో జపాన్ శాస్త్రజ్ఞులు మరో అడుగు ముందుకు వేసి రోదసిలో ఓ స్పేస్ సోలార్ పవర్ సిస్టం అనే ఒక మంచి ప్రాజెక్టును ప్రారంభించారు.దీనిలో భాగంగా భూవాతావరణం దాటాక,భూస్థిరకక్ష్యలో ఒక నిర్దిష్ట ప్రదేశం వద్ద, అనేక చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ' ఫొటో ఓల్టాయిక్ డిష్ లను ఏర్పాటు చేస్తారు.ఆ కక్ష్యలో ఉండే ఉపగ్రహాలలాగే ఈ డిష్ లు కూడా భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంతో సమానంగా తిరుగుతూ,నేలపై నుంచి ఎప్పుడు చూసినా ఒకే ప్రదేశం వద్ద ఉన్నట్లు కనిపిస్తాయి.అంతరిక్షంలోని ఈ డిష్ లు అపరిమితంగా లభించే సౌరశక్తిని గ్రహించి,దానిని లేజర్ కిరణాల రూపంలో గాని,సూక్ష్మ తరంగాల రూపంలో గాని నేలకు పంపిస్తాయి.వీటి ద్వారా భూమిపై పెద్దమొత్తంలో విద్యుత్ ను పుట్టించి,వాడుకునేందుకు వీలవుతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.ఇది విజయవంతమైతే మిగతా దేశాలు కూడా ఇలాంటి వినూత్న పద్ధతులకు సన్నద్ధం కావచ్చు.
Monday, 24 April 2017
మనకు ఎలా వినిపిస్తుంది? / MANAKU YELA VINIPISTHUNDHI?
చెవిలో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి.బయటకు కనిపించే బాహ్యచెవి,మధ్య చెవిలను విడదీస్తూ సన్నని కాగితం పొరలాంటి కర్ణభేరి ఉంటుంది.ఇది ఒక క్రమ పద్ధతిలో పేర్చి ఉన్న మూడు చిన్న ఎముకలకు అతుక్కుని ఉంటుంది.బయటి చెవి ముందుగా శబ్దాన్ని గ్రహిస్తుంది.శబ్దం కర్ణభేరికి చేరగానే అది అటూ ఇటూ కదులుతూ కంపనాలను సృష్టిస్తుంది.అపుడు ఉత్పత్తయిన తరంగాలు మధ్య చెవిని చేరతాయి.అక్కడ ఉండే మూడు ఎముకలు ఆ తరంగాల తీవ్రతను రెండింతలు చేసి ,లోపలి చెవికి బదిలీ చేస్తాయి.అక్కడి నుంచి విద్యుత్ తరంగాలుగా మార్పు చెందిన శబ్ద తరంగాలు శ్రవణ నాడి ద్వారా మెదడుకు చేరతాయి.మెదడులోని ఆడిటరీ విభాగం దానిని విశ్లేషిస్తుంది.అప్పుడు మనం వినగలుగుతాము.
అగ్గి పుల్ల ఎలా అంటుకుంటుంది? / AGGI PULLA YELA ANTUKUNTUNDI?
అగ్గిపుల్ల తలకాయను భాస్వరం,మరికొన్ని ఇతర పదార్థాలతో తయారు చేస్తారు.భాస్వరం అనేది 50 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత వద్దే సులభంగా అంటుకుంటుంది.అగ్గిపుల్లను మనం కాస్త గరుకుగా ఉండే అగ్గిపెట్టె పక్క భాగంలో వేగంగా రుద్దినప్పుడు ఆ భాగానికి ,అగ్గిపుల్ల తలకూ మధ్య ఘర్షణ ఏర్పడి ఉష్ణశక్తి పుడుతుంది.అంతే ,ఈ వేడికి అగ్గిపుల్ల వెంటనే అంటుకుని మండటం మొదలుపెడుతుంది.సినిమాల్లో కొందరు హీరోలు చేతుల మీద ,కాళ్ళమీద అగ్గిపుల్లలను గీసి వెగించడం మనం చూస్తుంటాము.సాధారణంగా అలా జరిగే అవకాశం ఉండదు.ఐతే వేడిగా ఉన్న బండల మీద ,గోడల పైన అగ్గిపుల్లలను గీసి వాటిని అంటించడం మాత్రం సాధ్యమయ్యే విషయమే.
Friday, 21 October 2016
ఢిల్లీకి ఆ పేరు ఎలా వచ్చింది? / DELHI KI AA PERU YELA VACHINDHI?
చారిత్రక ఆధారాలను గమనించినట్లైతే ఢిల్లీని ఏడు సార్లు నిర్మించినట్లు తెలుస్తోంది.దీని మొట్టమొదటి పేరి ' ఇంద్ర ప్రస్థం '.పురాణాలలో ఈ పేరుతోనేఎ పేర్కొనేవారు.క్రీ.పూ.1400 సంవత్సరాల ప్రాంతంలో ఇది పురాణా ఖిల్లా,హుమాయూన్ టూంబ్ ల మధ్య ప్రాంతంలో ఉండేది.క్రీ.పూ.1 వ శతాబ్దంలో కుతుబ్మినార్ ప్రాంతంలో ధిలు అనే రాజు ఢిల్లీని నిర్మించాడు.ఆయన పేరు మీద ఇది వరుసగా ధిల్లి,ఢిల్వి,ఢిల్లీ అయింది.13 వ శతాబ్దంలో కుతుబుద్దీన్ కుతుబ్ మినార్ ను కట్టించి ఢిల్లీ ని రాజధానిగా చేసుకుని పాలించాడు.1296-1316 లో 2 వ సారి ఢిల్లీని అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు.3 వ సారి ఢిల్లీని 1320-25 లో ఘియాసుద్దీన్ తుగ్లక్ నిర్మించాడు.4 వ సారి ఢిల్లీని 1351-88 ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించాడు. 5 వ సారి 1526 లో హుమయున్, 6 వ సారి 1540 లో షేర్ షా, 7 వ సారి 1629-58 షాజహాన్ నిర్మించాడు.తర్వాత ఎన్నో సార్లు ఢిల్లీ తన రూపురేఖలు మార్చుకుంటూ వచ్చింది.ఢిల్లీ అని అలవాటుగా మనం అంటున్నాం కానీ నిజానికి దానిని దిల్లీ అనాలి.
Subscribe to:
Comments (Atom)
వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
ధర్మానికి చిహ్నం ప్రాచీన కాలంలో ఇండియాకు రాజులు (సింహాసనం) సింహాలు చెక్కి ఉన్న బంగారు పీఠం మీద కూర్చుని ధర్మ నిర్ణయం చేసేవారు. అశోకుని ధర్మ...
-
కంపించే వస్తువుల వల్ల ధ్వని పుడుతుంది.ఐతే కంపించే అన్ని వస్తువుల ధ్వని మనం వినలేము.మనం వినగలిగే వాటిని శ్రావ్య ధ్వనులంటారు.శబ్దం యాంత్రిక తర...