చారిత్రక ఆధారాలను గమనించినట్లైతే ఢిల్లీని ఏడు సార్లు నిర్మించినట్లు తెలుస్తోంది.దీని మొట్టమొదటి పేరి ' ఇంద్ర ప్రస్థం '.పురాణాలలో ఈ పేరుతోనేఎ పేర్కొనేవారు.క్రీ.పూ.1400 సంవత్సరాల ప్రాంతంలో ఇది పురాణా ఖిల్లా,హుమాయూన్ టూంబ్ ల మధ్య ప్రాంతంలో ఉండేది.క్రీ.పూ.1 వ శతాబ్దంలో కుతుబ్మినార్ ప్రాంతంలో ధిలు అనే రాజు ఢిల్లీని నిర్మించాడు.ఆయన పేరు మీద ఇది వరుసగా ధిల్లి,ఢిల్వి,ఢిల్లీ అయింది.13 వ శతాబ్దంలో కుతుబుద్దీన్ కుతుబ్ మినార్ ను కట్టించి ఢిల్లీ ని రాజధానిగా చేసుకుని పాలించాడు.1296-1316 లో 2 వ సారి ఢిల్లీని అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు.3 వ సారి ఢిల్లీని 1320-25 లో ఘియాసుద్దీన్ తుగ్లక్ నిర్మించాడు.4 వ సారి ఢిల్లీని 1351-88 ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించాడు. 5 వ సారి 1526 లో హుమయున్, 6 వ సారి 1540 లో షేర్ షా, 7 వ సారి 1629-58 షాజహాన్ నిర్మించాడు.తర్వాత ఎన్నో సార్లు ఢిల్లీ తన రూపురేఖలు మార్చుకుంటూ వచ్చింది.ఢిల్లీ అని అలవాటుగా మనం అంటున్నాం కానీ నిజానికి దానిని దిల్లీ అనాలి.
Subscribe to:
Posts (Atom)
వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
మన ఎముకలూ , దంతాల పెరుగుదలకుఒ ,పోషణకూ కాల్షియం ఎంతైనా అవసరం. గుండె ,కండరాల కార్య కలాపాలకు కూడా కాల్షియం అవసరమవుతుంది..మనం రోజూ సగటున 1 గ్రామ...
-
కాంతి కిరణాలు ,కొలను అడుగునుండి బయలుదేరి నీటిగుండా గాలిలోకి ప్రయాణించేప్పుడు ,సాంద్రతమ యానకం నుంచి విరళతమ యానకం లోకి ప్రయాణిస్తాయి.కాబట్టి అ...
-
ఏదైనా ఒక వస్తువు పసుపు రంగులో కనిపిస్తుంది అంటే దానర్థం అది తెల్లని కాంతిలోని అన్ని రంగులనూ శోషించుకుని ఒక పసుపు రంగుని మాత్రమే తిప్పి కొడుత...