Saturday, 7 July 2018

భారీ రోడ్డు వాహనాలకు దీజిల్ నే యెందుకు వాడతారు?



అంతర్దహన యంత్రాలలో వాడే ఇతర ఇంధనంతో పోలిస్తే దీజిల్ కు అధిక సామర్థ్యం ఉంది. అంతే కాకుండా యెక్కువ పొదుపు కూడా.ఇది ఉత్పత్తి చేసే ఉష్నంలో దాదాపు 40% వినియోగమౌతుంది.దీజిల్ యింజన్ల మెకానిజం కూడా ఇతర ఇంజన్ల కంటే సులభంగా ఉంటుంది.

నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఉంటాయి.యెందుకు?



నక్షత్రాల నుంచి వచ్చే కాంతి కిరణాలు ,వివిధ సాంద్రతలున్న వివిధ వాయు పొరల గుండా ప్రయణం చేయవలసి ఉంటుంది.అందువల్ల వక్రీభవనానికి లోనవుతాయి.ఫలితంగా మిణుకుమిణుకుమంటూ ఉంటాయి.

మంచు తెల్లగా యెందుకు ఉంటుంది?

చిన్న చిన్న పారదర్షక స్ఫటికాలతో రూపొందిన మంచుకు నిజానికి రంగు ఉండదు.గాలిలోని అణువులతో ఆవ్రుతమైన ఈ స్ఫటికాల ఉపరితలాల మీద వెలుగు కిరణాలు పరావర్తనం చెందటం వల్ల మంచుకు తెలుపు రంగు వస్తుంది.

మేఘాలు యే విధంగా యేర్పడతాయి?



సూర్య రశ్మి వలన , గాలి వలన, సముద్రాలు, చెరువులు ,సరస్సులు,కుంటలు,నదులు తదితర నీతివనరుల నుండి నీరు ఆవిరై వాతావరణం లోని యెత్తైన ప్రదేశాల్లోకి చేరుకొంటుంది.అక్కడ ఈ నీటి ఆవిరి చిన్న చిన్న నీటి బిందువులుగా ద్రవీభవించి మేఘాలు యేర్పడతాయి.మేఘాల్లోని ఈ నీటి బిందువులు సంలీనత చెందినపుడు వర్షం పడుతుంది.

Thursday, 29 June 2017

అన్ని గ్రహాల మీద రోజుకి 24 గంటలు ఉండవా ? / ANNI GRAHALA MEEDHA 24 GANTALU VUNDAVA?


ఒక పగలుని , ఒక రాత్రిని కలిపి మనం రోజు అంటున్నాము.ఏ గ్రహానికి సంబంధించిన  రోజు ఐనా ఆ గ్రహం తన చుట్టూ తాను ఒకసారి పూర్తిగా తిరిగే  సమయం మీద ఆధారపడీ ఉంటుంది.భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు స్థూలంగా 24 గంటలు పడుతుంది.

అందుకే ఇక్కడ ఒక పగలు ,ఒక రాత్రి పూర్తయ్యేందుకు 24 గంటల సమయం పడుతుంది.కాని అన్ని గ్రహాల సంగతి అలా ఉండదు.ఉదాహరణకు గురు గ్రహం తనచుట్టూ తాను మన భూమి కన్నా చాలా వేగంగా తిరుగుతుంది.అందుకని అక్కడ 10 గంటల్లో ఒక రోజు పూర్తవుతుంది.అంటే ఆ గ్రహం మీద 5 గంటలు పగలు, 5 గంటలు రాత్రి ఉంటుందన్నమాట.అలాగే కుజ గ్రహం మన భూమి అంత వేగంతోనే తిరగడం వల్ల మన రోజుకు అక్కడి రోజుకు పెద్ద తేడా ఏమి ఉండదు.మన రోజుకన్నా అక్కడి రోజులో ఒక 37 నిమిషాలు ఎక్కువగా ఉంటాయంతే.ఇక బుధ గ్రహం మన భూమి కన్నా చాలా నిదానంగా తిరుగుతుంది.మన భూమి మీద 59 రోజులు గదిస్తే కాని అక్కడ ఒక రోజు పూర్తి కాదు.అంటే అక్కడ ఒక రోజుకి 1,416 గంటలన్నమాట.ఇక శుక్రగ్రహం మీదైతే 5832 గంటలు గడిస్తే కాని రోజు పూర్తి కాదు.భూమి మీద 243 రోజులు పూర్తైతే అక్కడ ఒక రోజు పూర్తవుతుంది.అలాగే ఉరేనస్ 16 గంటల 48 నిమిషాలు,నెఫ్త్యూన్ 18 గంటలుఫ్లూటో 168 గంటలు సమయాన్ని ఒక రోజు పూర్తి చేయడానికి తీసుకుంటాయి.ఆయా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే సమయాల్లో కూడా చాలా తేడా ఉంటుంది.

భూగర్భ రైలు మార్గం ఎలా నిర్మిస్తారు? / BHUGARBHA RAILUMARGAM YELA NIRMISTARU? / UNDERGROUND RAILWAYS


ఇప్పుడు అన్ని దేశాలలోనూ రైలు మార్గాలు ఉన్నాయి.రేయీ పగలూ మనుషులను సరకులనూ రవాణా చేస్తున్నాయి.అనేక దేశాలలో భూగర్భ రైలు మార్గాలు కూడా ఉన్నాయి.ఐతే ప్రపంచంలోకెల్లా పురాతన రైలు మార్గం మాత్రం లండన్ నగరంలో ఉంది.రైలు మార్గం ఎక్కది నుండి ఎక్కడికి వేయాలో నిర్ణయించిన తర్వాత వీధులలోఅ లోతుగా కందకం తవ్వుతారు.తర్వాత రైలు పట్టాలను పరుస్తారు.గోతిని మూసివేస్తారు.ఈ పద్ధతిని కట్ అండ్ కవర్ అంటారు.

లండనులో నిర్మించిన రైలు మార్గం సుమారు 4 మైళ్ళ పొడవు ఉంది.దీనిని లండన్ నగరంలో పేడింగ్ టన్ స్టేషన్ నుండి ఫారింగ్ టన్ స్టేషన్ వరకు నిర్మించారు.10 జనవరి 1863 నుండి రైళ్ళు తిరగడం ప్రారంభించాయి.మొదట వీటి పై ఆవిరి రైలింజన్ లు నడిచాయి.ఇంజను నుండి వచ్చే పొగ వల్ల ప్రయాణీకులకు చాలా ఇబ్బందిగా ఉండేది.కానీ ప్రపంచంలో తొలి భూగర్భ రైలు మార్గం కావడం తో ప్రయాణీకులు తండోపతండాలుగా వచ్చే వారు.ఈ రైళ్ళలో ప్రతి రోజూ సుమారు 30,000 మంది ప్రయాణించేవారు.

ఆ తర్వాత కొంత కాలానికి మరికొన్ని రైలు మార్గాలను నిర్మించారు.1890 లో లోతైన సొరంగ మార్గం గుండా విద్యుచ్చక్తి రైళ్ళను నడపటానికి వీలుగా రైలు మార్గాలను   లండనులో నిర్మించారు.మొదట్లో రైళ్ళకు కిటికీలు ఉండేవి కావు.ఎందుకంటే రైలు సొరంగంలో వెడుతుంది కాబట్టి చూసేందుకు ఏమీ ఉండదు.రైల్వే లైనులో లోతైన భూగర్భ స్థలం హేంస్ స్టెడ్ దగ్గర ఉంది.ఇక్కడ లోతు 67.3 మీటర్లు.స్టేషన్ రాగానే రైలు గార్డు స్టేషన్ పేరును గట్టిగా అరిచేవాడు.1979 నాటికి ఈ మార్గంలో 500 రైళ్ళు ప్రయాణీకులను తీసుకెళ్ళాయి.వీటిలో కెల్ల దూరమైన మార్గం ఎప్టింగ్ నుండి రుస్లిప్ కు ఉంది ( 54.8 కి.మీ )

ఇతర దేశాలలో కూడా భూగర్భ రైలు మార్గాలు ప్రజాదరణ పొందాయి.1900 లో పారిస్ లో ప్రారంభించారు.అమెరికాలో మొదటి సబ్ వే లైనును బోస్టన్ లో 1895 -1897 ల మధ్య నిర్మించారు.1904 లో న్యూయార్క్ లో మొదటి భూగర్భ రైల్వే మొదలయింది.ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా పెద్దది.1930 లో మాస్కోలో నిర్మించారు.

జపానులో టోక్యో నగరంలో 1927 లోనే మొదలయింది.కెనడాలో 1954 లో టొరంటో సబ్ వే ప్రారంభించారు.ఇంకా మరికొన్ని దేశాలలో ఈ మార్గాలున్నాయి.మన దేశంలో కలకత్తాలో మొదటి భూగర్భ రైల్వే మార్గం 1986 లో ప్రారంభించారు.

కంప్యూటర్ కి వైరస్ ఎందుకు వస్తుంది? / COMPUTER KI VIRUS YENDHUKU VASTHUNDHI?




కంప్యూటర్ ని పని చేయించేదుకు మనం కొన్ని కమాండ్స్ ఇస్తాము.ఈ కమాండ్స్ అన్నిటిని కలిపి సాఫ్ట్ వేర్ అంటారు.కంప్యూటర్ ఏ విధంగా ఏ పనులు చేయాలనేది సాఫ్ట్ వేర్ నిర్ణయిస్తుంది.కంప్యూటర్ పనితీరు గురించి బాగా అవగాహన ఉన్నవారు సరదా కోసమో, దురాలోచనతోనో కొన్ని రకాల సాఫ్ట్ వేర్ లను తయారు చేస్తారు.ఇవి కంప్యూటర్లను తప్పుదారి పట్టించడం , పని చేయకుండా నిలిచిపోయేలా చేయడం లేదా నిల్వ ఉన్న సమాచారం అంతా చెరిగిపోయేలా చేసి ఎంతో నష్టం కలిగిస్తాయి.ఇలాంటి సాఫ్ట్ వేర్ లనే  వైరస్ అంటారు.అందుకే కంపెనీలు తయారు చేసిన వైరస్ లేని సాఫ్ట్ వేర్ లను వాడడం మంచిది.ఇంటర్నెట్నుంచి సమాచారం తీసుకునేటప్పుడు , మెయిల్ చేసేటప్పుడు,కొత్త సాఫ్ట్ వేర్ లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.మానవ వైరస్ లకు టీకాలు ఎలాగో , కంప్యూటర్ వైరస్ లను యాంటివైరస్ సాఫ్ట్ వేర్ లను వాడి తొలగించుకోవచ్చు.


వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...