Wednesday, 7 June 2017

కంప్యూటర్ పక్కనున్న సెల్ ఫోన్ నుండి కీచు కీచు శబ్దాలెందుకు వస్తాయి? / COMPUTER PAKKANUNNA CELLPHONE NUNDI SHABDALENDUKU VASTAAYI?


ఇలా శబ్దాలు రావడానికి కారణం కంప్యూటర్ నుండి వెలువడుతున్న విద్యుదయస్కాంత తరంగాలు / రేడియో తరంగాలు సెల్ ఫోన్ లోని తరంగాలతో జోక్యం చేసుకోవడమే.కరెంట్ తో పని చేసే ప్రతి వస్తువు నుండి రేడియో తరంగాలు వెలువడుతుంటాయి.వీటిలో మారుతున్న విద్యుత్ ప్రవాహాలు విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేస్తాయి.భారీ యంత్రాలు పని చేస్తున్నపుడు ధ్వని తరంగాలు ఎలా ఉత్పత్తి అవుతాయో అలా కరెంట్ పై పని చేసే కంప్యూటర్లు , సెల్ ఫోనుల్లో రేడియో తరంగాలు ఉత్పన్నమౌతాయి.కంప్యూటర్లు స్వాభావికంగా శబ్దాలను వెలువరిస్తుంటాయి.ఎందుకంటే దానిలో వేగంగా మారుతున్న విద్యుత్ ప్రవాహాలు అందులోని సంకేతాలను మారుస్తాయి కాబట్టి.కంప్యూటర్లు , లాప్టాప్లకు అతి సమీపంలో ఉన్న సెల్ ఫోన్ నుండి శబ్దాలు వెలువడటానికి ఒక కారణం కంప్యూటర్ నుండి వెలువడే రేడియో తరంగాల పౌన:పున్యం సెల్ ఫోన్ పనిచేసే రేదియో తరంగాల పౌన:పున్యానికి సమానంగా ఉండటమే.అంటే సెకనుకు 800 మిలియన్ల సైకిల్స్ / 800 మెగా హెడ్జ్. హెడ్జ్ అనేది పౌన:పున్యానికి ప్రమాణం.మరో కారణం కంప్యూటర్ వెలువరించే రేడియో తరంగాలు, సెల్ ఫోన్ లోని స్పీకర్ పనిచేయడానికి వీలుగా దానికి అనుసంధానించి ఉండే ఆంప్లిఫయర్లో విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపింప చేయడంతో సెల్ ఫోన్ లో కీచు కీచు మనే శబ్దాలు,ఒక్కోసారి రింగ్ వస్తుంది.ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా వరకు మెటల్ బాక్స్ లోనో లేక వాటిపై లోహ సంబంధిత పూతలు పూసి ఉండటంతో వాటిలో ఉత్పన్నమయ్యే రేడియో తరంగాలు వెలుపలికి రాకుండా పట్టి ఉంచుతాయి.కానీ ఆ పరికరాల్లో అతి సన్నని రంధ్రాలు ఉంటే వాటి గుండా వచ్చే రేడియో తరంగాలు, వాటికి దగ్గరగా ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రభావితం చేస్తాయి.అందువల్లనే కంప్యూటర్లకు దగ్గరగా ఉండే సెల్ ఫోనుల్లో కీచు కీచు మనే శబ్దాలు వస్తాయి.

Tuesday, 6 June 2017

అంతరిక్షంలో కూడా విద్యుత్ ను పుట్టించవచ్చా? / ANTHARIKSHAM LO KOODA VIDYUTH NU PUTTINCHAVACHA?


భూవాతావరణాన్ని దాటాక సౌరశక్తి చాలా తీవ్రంగా ఉంటుంది.నేలను తాకే సూర్య రశ్మికన్నా భూవాతావరణాన్ని దాటాక లభించే సూర్యరశ్మి సుమారు 5 రెట్లు శక్తివంతంగా ఉందని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు.దాంతో అంతరిక్షంలోనే సౌరవిద్యుత్తును తయారు చేసి దానిని ఏదో ఒక రూపంలో భూమికి తీసుకురాగలిగినట్లైతే విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చవచ్చని అదే సమయంలో వాతావరణ కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.ఈ విషయంలో జపాన్ శాస్త్రజ్ఞులు మరో అడుగు ముందుకు వేసి రోదసిలో ఓ స్పేస్ సోలార్ పవర్ సిస్టం అనే ఒక మంచి ప్రాజెక్టును ప్రారంభించారు.దీనిలో భాగంగా భూవాతావరణం దాటాక,భూస్థిరకక్ష్యలో ఒక నిర్దిష్ట ప్రదేశం వద్ద, అనేక చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ' ఫొటో ఓల్టాయిక్ డిష్ లను ఏర్పాటు చేస్తారు.ఆ కక్ష్యలో ఉండే ఉపగ్రహాలలాగే ఈ డిష్ లు కూడా భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంతో సమానంగా తిరుగుతూ,నేలపై నుంచి ఎప్పుడు చూసినా ఒకే ప్రదేశం వద్ద ఉన్నట్లు కనిపిస్తాయి.అంతరిక్షంలోని ఈ డిష్ లు అపరిమితంగా లభించే సౌరశక్తిని గ్రహించి,దానిని లేజర్ కిరణాల రూపంలో గాని,సూక్ష్మ తరంగాల రూపంలో గాని నేలకు పంపిస్తాయి.వీటి ద్వారా భూమిపై పెద్దమొత్తంలో విద్యుత్ ను పుట్టించి,వాడుకునేందుకు వీలవుతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.ఇది విజయవంతమైతే మిగతా దేశాలు కూడా ఇలాంటి వినూత్న పద్ధతులకు సన్నద్ధం కావచ్చు.

జలుబు,దగ్గులాంటివి,వానాకాలం,చలి కాలాల్లోనే ఎందుకొస్తాయి?మిగతా కాలాల్లో ఎందుకు రావు?JALUBU,DAGGU LANTIVI VANAKALAM,CALI KALAMLONE ENDUKOSTAYI?MIGATA KALALLO ENDUKU RAVU.?


జలుబు సాధారణంగా వైరస్ ద్వారా వస్తుంది.వాతావరణంలోనూ,తాగే నీటిలోనూ,దుమ్ము,ధూళి కణాలపైన వైరస్ ఉంటుంది.బ్యాక్టీరియా లేదా ఇతర జీవ కణాల ఆవాసం లేకుండా వైరస్ లు వృద్ధి కాలేవు.ఎండాకాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల బ్యక్టీరియా ,ఇతర సూక్ష్మ జీవుల ఉనికి తక్కువగా ఉంటుంది.వాట్పై ఆధారపడే వైరస్ లు కూడా తక్కువగానే ఉంటాయి.ఎక్కడపడితే అక్కడ తడి ఉండకపోవడం వల్ల వైరస్ ల వ్యాప్తికి అవకాశాలు తక్కువ.కాబట్టి జలుబు కలిగించే వైరస్ ల ప్రభావం తక్కువగా ఉంటుంది.వానా కాలంలో నీరు వివిధ పదార్థాలను తనతో తీసుకెల్తుంది.ఇవి తాగునీటి వనరులనూ కలుషితం చేస్తాయి.వైరస్ ల వ్యాప్తికి దోహద పడతాయి.వాతావరణంలో ఉష్ణోగ్రత బ్యాక్టీరియా,దోమలు తదితర సూక్ష్మ జీవుల పెరుగుదలకు అనుకూలిస్తుంది.తద్వారా వైరస్ ల వ్యాప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. 

Sunday, 4 June 2017

ఈతగాళ్ళు ప్రత్యేకమైన కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటారు? / EETHAGALLU PRATHYEKAMAINA KALLADDHALU YENDHUKU PETTUKUNTARU?


కాంతికిరణాలు ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రవేశించేటప్పుడు ఒక నిర్దిష్టకోణంలోనికి వంగుతాయి.ఇంకోలా చెప్పాలంటే అలాంటి సందర్భాలలో వాటి ప్రయాణమార్గంలో మార్పు వస్తుంది.దీనినే వక్రీభవనం అంటారు.వస్తువు నుంచి పరావర్తనం చెంది బయలుదేరే కాంతి ముందుగా గాలిలోనూ ,ఆ తరువాత మన కంటి పైభాగంలోనూ రెండు సార్లు వక్రీభవనానికి గురై ,చివరకు రెటీనాపై పడుతుంది.ఆ విధంగా మనకు ఒక వస్తువు లేదా దృశ్యం కనిపిస్తుంది.కాని ఒక వేల గాలి వక్రీభవనగుణకం ,మన కంటి వక్రీభవన గుణకం ఒకేవిధంగా ఉన్నట్లైతే ఆయా వస్తువులను చూడడం మనకు చాలా కష్టమౌతుంది.దానికి భిన్నంగా నీటి వక్రీభవన గుణకం ,మన కంటి వక్రీభవన గుణకం దాదాపుగా ఒకేలా ( 1.34 ) ఉంటాయి.ఇలా రెండు యానకాల వక్రీభవన గుణకాలు సమానంగా ఉన్నప్పుడు ,ఒక యానకం నుండి మరొక యానకంలోనికి కాంతి దూసుకుపోయినప్పుడు గమన మార్గంలో ఎటువంటి మార్పు రాక అది సూటిగా దూసుకు పోతుంది.అలాంటి సమయాల్లో వస్తువులను చూడడం మనకు కష్టమౌతుంది.నీటిలో ఉన్నప్పుడు ఈ కారణంగానే మనకు వివిధ వస్తువులు ,జలచరాలు స్పష్టంగా కాకుండా అలుక్కుపోయినట్లు కనిపిస్తాయి.ఇలా జరగకుండా ఉండడం కోసమే సముద్రంలో ఈదే వాళ్లు ప్రత్యేకమైన కళ్ళద్దాలు ధరిస్తారు.ఈ కళ్ళద్దాలలో గాజుపలకల మధ్య గాలి నిండి ఉంటుంది.నీటిలోంచి వచ్చిన కిరణాలు గాలిలోనికి ప్రవేశించి , ఆ తర్వాతే కళ్ళలోకి వస్తాయి.దాంతో అవి వేర్వేరు వక్రీభవనాలకు గురై చివరకు ఆ వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి.

Saturday, 27 May 2017

NEETIKI YE RANGU YENDUKUNDADU?/ నీటికి ఏ రంగూ ఎందుకుండదు?

ఏదైనా ఒక వస్తువు పసుపు రంగులో కనిపిస్తుంది అంటే దానర్థం అది తెల్లని కాంతిలోని అన్ని రంగులనూ శోషించుకుని ఒక పసుపు రంగుని మాత్రమే తిప్పి కొడుతుంది అని.అన్ని వస్తువులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.ఇలా వస్తువుపై పడి పరావర్తనం చెంది వచ్చి మన కంటిని చేరే కాంతికిరణాల మూలంగానే మనం ఆ వస్తువును , దాని రంగును తెలుసుకోగలుగుతున్నాం.

పాల లాగా పూర్తిగా తెల్లగా ఉండే పదార్థాలు, బొగ్గులాగా పూర్తిగా నల్లగా ఉండే పదార్థాలు కాంతి విషయంలో మరో రకంగా ప్రవర్తిస్తాయి.తెల్లని వస్తువులు అన్ని రకాల కాంతికిరణాలను తిప్పికొడితే , నల్లని వస్తువులు అన్ని కాంతికిరణాలను శోషింపచేసుకుంటాయి.అందువల్ల తెల్లని వస్తువులు తెల్లగా, నల్లని వస్తువులు నల్లగా కనిపిస్తాయి.{ నల్లని వస్తువుపై పడిన కాంతికిర్ణాల్లో కొన్నైనా తిరిగిరావడం వల్ల అది కనిపిస్తుంది , లేకపోతే అదికూడా ఉండదు.}

ఇక నీటి విషయానికి వస్తే ,అదికూడా తెల్లని వస్తువుల్లాగా,నల్లని వస్తువుల్లాగా కాంతికి సంబంధించిన విభిన్న కిరణాల విషయంలో ఎలాంటి భేదభావం చూపదు.

అంటే నీరు తనపై పడే కాంతిలోని అన్ని రంగులనూ సమానంగా శోషింపచేసుకుంటుంది,సమానంగా పరావర్తనం చెందిస్తుంది,అదే సమయంలో అన్ని రంగులనూ తనగుండా పోనిస్తుంది.సాధారణంగా నీటిపై పడిన కాంతిలో ఎక్కువ భాగం దానిగుండా ప్రయాణించి అంతర్థానమైపోతుంది.నీటికి ఉన్న ఇలాంటి ప్రత్యేక ధర్మాల వల్లనే అది ఏ రంగూ లేకుండా కంపిస్తుంది.
ఒకవేళ ఎక్కడైన ఏ నీరైనా ఏదైనా రంగులో ఉందంటే అది స్వచ్చమైన నీరు కాదని,లేదా దాని పరిసరాలలోని వివిధ అంశాల ప్రభావం దానిపై బలంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి.

ఆకలి ఎందుకు వేస్తుంది? / AKALI YENDUKU VESTHUNDHI?


మన శరీరం ఎప్పుడూ ఒక యంత్రంలా పని చేస్తుంది.అందుకొరకు ప్రతి అవయవానికి శక్తి కావాల్సి ఉంటుంది.ఆయా సందర్భాలను బట్టి,చేసే పనులను బట్టి మనకు కావలసిన శక్తిలో కొచెం హెచ్చుతగ్గులు చోటుచేసుకోవచ్చు.అది వేఅరే విషయం.మనకు కావలసిన శక్తి,తీసుకునే ఆహారం ద్వారానే లభిస్తుంది.ఈ శక్తిని,వేడి ,చలనం వంటి వేర్వేరు శక్తి రూపాల్లోనికి మార్చుకొని సరీరం ఉపయోగించుకుంటుంది.అందుకని శక్తి ఉత్పాదనకు అవసరమయ్యే ఆహారం ,నీరు కావాల్సి వచ్చినప్పుడల్లా సరీరం అందుకు తగిన సంకేతాలను మెదడుకు పంపుతుంది.మెదడుకు అందే ఈ సంకేతాలు,అలాగే వాటికి మెదడు స్పందించడంలో భాగంగా మనకు ఆకలి,దాహం తెలుస్తాయి.ఇంతకుముందు మనం తీసుకున్న ఆహారం ఖర్చయిపోయి కడుపు ఖాళీగా మారినప్పుడు ఆ విషయం నాడీమండలం ద్వారా మెదడుకు అందుతుంది.సరిగ్గా అలాంటి సమయాల్లోనే మనకు ఆకలిగా అనిపిస్తుంది.దానితో ఆ ఆకలిని తీర్చుకునేందుకు ఏదొ ఒకటి తిని శరీర శక్తి అవసరాలను తీర్చుకుంటాము.

Saturday, 6 May 2017

పాలు ఎందుకు పొంగుతాయి? / PALU YENDUKU PONGUTHAYI?



పాలలో 85% నీరు ఉంటుంది.మిగతా 15%కొవ్వులు,మాంసకృత్తులు,చక్కెర,ఇంకా లవణాలు ఉంటాయి.పాలల్లో ఈ పదార్థాలన్నీ ఉన్నందున మామూలు నీరు మరిగే ఉష్ణోగ్రతకి,పాలు మరిగే ఉష్ణోగ్రతకి కొంత తేడా వస్తుంది.సాధారణంగా నీరు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరుగుతుందన్న సంగతి తెలుసు .పాలు మరిగే ఉష్ణోగ్రత దీనికన్నా ఓ అర డిగ్రీ ఎక్కువగా ఉంటుంది.ఐతే పాలు మరగడానికి కొంచెం ముందుగా అందులోని కొవ్వు,మాంస కృత్తుల్లో  కొంత భాగం పాల పై భాగంలో ఒక పలుచని పొరలాగా రూపొందుతుంది.పాలు మరిగే ఉష్ణోగ్రతకి చేరి అందులోంచి నీటి ఆవిరి బయటకు రావడం మొదలుపెట్టినప్పుడు ఈ మీగడ పొర దానికి అడ్డుగా నిలుస్తుంది.ఐతే నీటి ఆవిరి ఊర్ధ్వ ముఖంగా కలిగించే ఒత్తిడి మూలంగా ఈ మీగడ పొర తప్పనిసరై గిన్నెలో పైకి లేస్తుంది.కాని ఆవిరి కలిగించే ఒత్తిడి కారణంగా ఇందులో పలు పగుళ్లు వస్తాయి.పాలలో ఉండే కొవ్వు ,మాంస కృత్తుల సాయంతో ఆ పగుళ్లు క్షణాలలో పూడి, మళ్లీ కొత్త పొర రూపొందుతుంది.దాంతో  నీటి ఆవిరి ఆ పొరను మళ్ళీ పైకి ఎగదన్నుతుంది.సరిగ్గా ఈ ప్రక్రియనే మనం పాలు పొంగడం అని అంటున్నాం.నీటి ఆవిరితో పైకి లేచిన మీగడ పొర మళ్ళీ పగలడం,తిరిగి మీగడ పొర కొత్తగా ఏర్పడడం అనే ప్రక్రియ కొన్ని నిమిషాల పాటు కొనసాగుతూనే ఉంటుంది.ఒక్కోసారి ఇందులో భాగంగా పాలు బాగా పొంగి గిన్నె బయటకు కూడా వస్తుంది.

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...