Sunday, 9 December 2018
సాధారణంగా వంట పాత్రలను అల్యూమినియంతో చేస్తారు.ఎందుకు?
అల్యూమినియం మంచి ఉష్ణవాహకం.దీని నిర్దిష్ట ఉష్ణం కూడా బాగా ఎక్కువే.అందువల్ల మిగిలిన లోహాల కంటే ఇది ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తుంది.పైగా ఇది అంత ఖరీదైన లోహం కూడా కాదు.అందువల్ల వంటపాత్రలను సాధారణంగా అల్యూమినియంతో చేస్తారు.
సిరాతో నింపిన ఫౌంటేన్ పెన్నులను విమానాల్లో తీసుకొనిపోవడానికి అనుమతించరు.ఎందుకు?
సముద్రమట్టంతో పోలిస్తే ఉన్నతప్రదేశాల్లో వాయు వాతావరణపీడనం అధికంగా ఉంటుంది.ఎత్తైన ప్రదేశాల్లో పెన్నులోని గాలి వ్యాకోచిస్తుంది.అందువల్ల పెన్నులోని ఇంకు బయటకు వస్తుంది.
Saturday, 8 December 2018
బల్బు పగిలినప్పుడు ఎందుకు శబ్దం వస్తుంది.?
బల్బు లోపల శూన్యం ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే .బల్బు పగిలినప్పుడు అందులోని శూన్యాన్ని భర్తీ చేయడానికి అన్ని వైపులనుండి గాలి ఎక్కువ వేగంతో బల్బులోకి ప్రవేశిస్తుంది.అందువల్ల శబ్దం వస్తుంది.
మైదానాల్లో వర్షిస్తున్నప్పుడు ఎత్తయిన కొండలమీద పొగమంచు కనిపిస్తుంది.ఎందుకు?
ఎత్తైన ప్రదేశాల్లోని వాతావరణ ఉష్ణోగ్రత సాధారణంగా నీటి ఘనీభవన స్థానం కంటే తక్కువగా ఉంటుంది.అందువల్ల ఆ ప్రాంతాల్లో ఉన్న నీటి ఆవిరులు ,మంచుగా మార్పు చెందుతాయి.
Friday, 7 December 2018
కరెంటును మందమైన రాగి తీగల ద్వారా ఎందుకు ప్రసారం చేస్తారు.
విద్యుత్ వాహక నిరోధం తీగ అడ్డు కోతతో విలోమంగా ఉంటుంది. మందమైన తీగలకు తక్కువ నిరోధం ఉంటుంది.రాగి ఉత్తమ విద్యుత్ వాహకాలో ఒకటి,కావున విద్యుత్ సరఫరాకు రాగిని వాడటం జరుగుతుంది.
మంచులో ఉష్ణం ఉంటుందా?
మంచులో ఉష్ణం ఉంటుంది.మంచు ఉష్ణోగ్రత 6 దిగ్రీలు ఐతే మంచు కరుగుతున్నపుడు అది ఉష్ణాన్ని శోషణం చేసుకుంటుంది.ఈ ఉష్ణాన్నే గుప్తోష్ణం అంటారు.ఇది 80 కెలొరీలు / గ్రాం కు సమానం.ఈ ఉష్ణం వల్లనే మంచు అత్యంత చల్లగా ఉండదు.
హిమ బిందువు ఎందుకు గుండ్రంగా ఉంటుంది.
హిమబిందువులోని ప్రతిభాగమూ దాని కేంద్రం నుంచి సమాన దూరంలో ఉంటుంది.అందుకే హిమబిందువు గుండ్రంగా ఉంటుంది.
Subscribe to:
Comments (Atom)
వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
ధర్మానికి చిహ్నం ప్రాచీన కాలంలో ఇండియాకు రాజులు (సింహాసనం) సింహాలు చెక్కి ఉన్న బంగారు పీఠం మీద కూర్చుని ధర్మ నిర్ణయం చేసేవారు. అశోకుని ధర్మ...
-
కంపించే వస్తువుల వల్ల ధ్వని పుడుతుంది.ఐతే కంపించే అన్ని వస్తువుల ధ్వని మనం వినలేము.మనం వినగలిగే వాటిని శ్రావ్య ధ్వనులంటారు.శబ్దం యాంత్రిక తర...