ఒక వస్తువుకు చెందిన రెండు ప్రతిబింబాలూ మన రెండు కళ్ళలోని రెండు రెటీనాలకు సంబంధించిన ఒకే భాగాల మీద సరిగ్గా పడతాయి.అందువల్ల పరివర్తనం కూడా ఏక కాలంలోనే జరుగుతుంది.అందువల్ల రెండు కళ్ళతోనూ ఒకే ఒక దృశ్యం చూడగలం.
Tuesday, 10 July 2018
మన రెండు కళ్ళతో వస్తువులను రెండుగా చూడం ఎందుకు?
ఒక వస్తువుకు చెందిన రెండు ప్రతిబింబాలూ మన రెండు కళ్ళలోని రెండు రెటీనాలకు సంబంధించిన ఒకే భాగాల మీద సరిగ్గా పడతాయి.అందువల్ల పరివర్తనం కూడా ఏక కాలంలోనే జరుగుతుంది.అందువల్ల రెండు కళ్ళతోనూ ఒకే ఒక దృశ్యం చూడగలం.
Saturday, 7 July 2018
ఒక పాత్రలో మండుతున్న పెట్రోల్ ను నీరు ఆర్పలేదు?
పెట్రోల్ మంట ఉష్ణం చాలా ఎక్కువగా ఉంటుంది.ఎంత ఎక్కువగానంటే ఆ మంట మీద నీల్లు పొసినట్లైతే , ఆ నీరు వెంటనే వియోగం చెందుతుంది.అందువల్ల ఆ మంటను నీరు ఆర్పలేదు.
వర్షానికి ముందు మనకు చెమట ఎందుకు పోస్తుంది?
వర్షానికి ముందు వతావరణంలోని గాలి , నీటి ఆవిరితో సంత్రుప్తమౌతుంది. అందువల్ల చెమట పరిశోషం చెందకుండా చర్మానికే అంటిపెట్టుకొంటుంది.
భారీ రోడ్డు వాహనాలకు దీజిల్ నే యెందుకు వాడతారు?
అంతర్దహన యంత్రాలలో వాడే ఇతర ఇంధనంతో పోలిస్తే దీజిల్ కు అధిక సామర్థ్యం ఉంది. అంతే కాకుండా యెక్కువ పొదుపు కూడా.ఇది ఉత్పత్తి చేసే ఉష్నంలో దాదాపు 40% వినియోగమౌతుంది.దీజిల్ యింజన్ల మెకానిజం కూడా ఇతర ఇంజన్ల కంటే సులభంగా ఉంటుంది.
నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఉంటాయి.యెందుకు?
నక్షత్రాల నుంచి వచ్చే కాంతి కిరణాలు ,వివిధ సాంద్రతలున్న వివిధ వాయు పొరల గుండా ప్రయణం చేయవలసి ఉంటుంది.అందువల్ల వక్రీభవనానికి లోనవుతాయి.ఫలితంగా మిణుకుమిణుకుమంటూ ఉంటాయి.
మంచు తెల్లగా యెందుకు ఉంటుంది?
చిన్న చిన్న పారదర్షక స్ఫటికాలతో రూపొందిన మంచుకు నిజానికి రంగు ఉండదు.గాలిలోని అణువులతో ఆవ్రుతమైన ఈ స్ఫటికాల ఉపరితలాల మీద వెలుగు కిరణాలు పరావర్తనం చెందటం వల్ల మంచుకు తెలుపు రంగు వస్తుంది.
మేఘాలు యే విధంగా యేర్పడతాయి?
సూర్య రశ్మి వలన , గాలి వలన, సముద్రాలు, చెరువులు ,సరస్సులు,కుంటలు,నదులు తదితర నీతివనరుల నుండి నీరు ఆవిరై వాతావరణం లోని యెత్తైన ప్రదేశాల్లోకి చేరుకొంటుంది.అక్కడ ఈ నీటి ఆవిరి చిన్న చిన్న నీటి బిందువులుగా ద్రవీభవించి మేఘాలు యేర్పడతాయి.మేఘాల్లోని ఈ నీటి బిందువులు సంలీనత చెందినపుడు వర్షం పడుతుంది.
Subscribe to:
Comments (Atom)
వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
ధర్మానికి చిహ్నం ప్రాచీన కాలంలో ఇండియాకు రాజులు (సింహాసనం) సింహాలు చెక్కి ఉన్న బంగారు పీఠం మీద కూర్చుని ధర్మ నిర్ణయం చేసేవారు. అశోకుని ధర్మ...
-
కంపించే వస్తువుల వల్ల ధ్వని పుడుతుంది.ఐతే కంపించే అన్ని వస్తువుల ధ్వని మనం వినలేము.మనం వినగలిగే వాటిని శ్రావ్య ధ్వనులంటారు.శబ్దం యాంత్రిక తర...